టీ తాగగానే కొంతమందికి బ్లోటింగ్, గ్యాస్, పట్టేసినట్లుగా ఉంటుంది. దీనికి కారణం టీలోని కెఫిన్, అమైనో యాసిడ్స్, పాలిఫెనాల్స్, అనేక సమస్మేళనాలు. ఇవి బాడీలో అనేక రకాలుగా పనిచేస్తాయి. బాడీ పనితీరుని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. టీలోని కఎఫిన్ కడుపు లైనింగ్ పనితీరుని ఎఫెక్ట్ చేస్తుంది. ఆమ్ల పిత్తరసాన్ని పెంచుతుంది. అంతేకాదు, జీర్ణ ఎంజైమ్స్ బ్యాలెన్స్ని తగ్గిస్తుంది. టీ తాగాక ఉబ్బరం పెరగడానికి టానిన్స్, కాటెచిన్స్ కూడా కారణమే. ఇవి కొంతమందికి పడకవు. జీర్ణక్రియని ఎఫెక్ట్ చేస్తాయి. కొన్నిసార్లు టీ తాగాక ఉబ్బరంగా అనిపించడానికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కూడా కారణమే. పీరియడ్స్, మెనోపాజ్, ప్రెగ్నెన్సీ టైమ్లో ఆడవారి జీర్ణ వ్యవస్థలో కొన్ని మార్పుల వల్ల టీ తాగాక ఉబ్బరం ఉంటుంది. అలా కాకుండా టీ తాగాక వచ్చే సమస్యల్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకోండి. దీంతో పాటు సరైన విధంగా టీని తయారు చేయాలి. దీంతో ఉబ్బరం రాకుండా ఉంటుంది.
టీ తయారు చేయడం
చాలా మంది టీని సరైన విధంగానే పెడుతున్నామనుకుంటారు. కేవలం, పాలు నీరు, టీ పౌడర్, పంచదార కలిపితే టీ అవుతుంది. ఇది ఎవరైనా పెడతారు. కానీ, ఇలా చేయడం వల్ల సమస్య వస్తుంది. అలా కాకుండా ఎప్పుడు పాలు వేయాలి. ముందుగా టీని ఎలా పెట్టాలి. ఎలా పెడితే తాగాక కూడా ఎలాంటి జీర్ణ సమస్యలు రావో తెలుసుకోవాలి. అసలు సరిగ్గా టీ పెట్టడం ఎలానో తెలుసుకోవాలి. అలా పెడితే రుచి కాస్తా వేరుగా ఉంటుంది. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు.
నీటిని మరిగించడం
టీని పెట్టే ముందు గిన్నెలో మీరు టీలో ఎంత నీరు పోయాలనుకుంటున్నారో అంత నీరు పోసి మరిగించండి. అది మరిగేటప్పు టీ పౌడర్ వేయండి. దాదపు 5 నిమిషాల పాటు మరగనివ్వండి. ఈ టైమ్లో మీరు వేయాలనుకుంటే అల్లం తురుము, యాలకులు వేయండి. దీని వల్ల రుచి రావడమే కాకుండా, రీఫ్రెష్గా ఉంటుంది.
పంచదార వేయడం
చాలా మంది పాలు వేశాక పంచదార వేస్తారు కానీ, అస్సలు వేయొద్దు. ముందుగా టీలో పంచదార వేసి కరగనివ్వండి. ఆ తర్వాతే పాలు వేయండి. పాలు వేశాక 5 నిమిషాలు మాత్రమే మరిగించాలి. అప్పుడు టీ సరైన రంగులోకి వస్తుంది. దీంతో టీ రెడీ అయినట్లే. మీరు తాగి ఎంజాయ్ చేయొచ్చు. మంచి గోల్డెన్ రంగులోకి వస్తుంది. అప్పుడే టీ చక్కగా రెడీ అయినట్లు. చాలా సేపు మరిగితే టీ టేస్టీగా ఉంటుందనుకుంటారు. కానీ, ఎక్కువసేపు మరిగించడం వల్లే ఎక్కువగా సమస్యలొస్తాయి.
టీ చేయడంలో తప్పులు
చాలా మంది అన్నీ ఒకేసారి వేసి మరిగిస్తారు. దీని వల్ల రుచిగా అనిపించినప్పటికీ తాగాక కడుపునొప్పి, గ్యాస్ పట్టేస్తుంది.
పాలతోనే టీ చేస్తుంటారు. ఇది అస్సలు మంచిది కాదు. దీని వల్ల అసిడిటీ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.
పాలు వేశాక ఎక్కువసేపు మరిగించడం కూడా అస్సలు సరికాదని గుర్తించండి.
అదే విధంగా, టీలో ఎక్కవగా టీపౌడర్, పంచదార వేయొద్దు. తక్కువ పరిమాణంలోనే వేయాలని గుర్తుంచుకోండి.
ఉబ్బరాన్ని ఎలా తగ్గించాలి
టీ తాగాక ఉబ్బరం ఎక్కువగా ఉంటే టీ తాగడాన్ని కంట్రోల్ చేయాలి. తక్కువ కెఫిన్ ఉన్న టీలని సెలక్ట్ చేసుకోండి. హెర్బల్ టీల వంటివి కూడా తీసుకోవచ్చు. పాలతో తయారైన టీ పడకపోయినా సమస్య వస్తుంది. కాబట్టి, దీన్ని అవాయిడ్ చేయండి. లెమన్ టీ, ఫెన్నల్ టీ, పుదీనా టీలను తీసుకోవచ్చు. దీని వల్ల కడుపు చల్లగా మారుతుంది. జీర్ణ ఎంజైమ్స్ పెరుగతాయి. అసిడిటీ, ఉబ్బరం సమస్యలు రావు.
ఖాళీ కడుపుతో వద్దు
అదే విధంగా ఎప్పుడు కూడా ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగొద్దు. బ్లాక్ టీ, గ్రీన్ టీ వంటివి తీసుకోవాలి. అయినప్పటికీ సమస్య తగ్గకపోతే ఓ సారి డాక్టర్ సలహా తీసుకోవాలి. వారు మీకు ఏమైనా సమస్యలున్నాయో చెక్ చేసి వాటికి తగ్గ పరిష్కారం చెబుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa