ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడపలో సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 21, 2023, 11:32 AM

కేంద్ర ప్రభుత్వం 2016లో పెద్ద నోట్ల రద్దుపై సీపీఎం పార్టీ చేసిన విమర్శ సరైందేనని రుజువైందని ఆ పార్టీ నగర కార్యదర్శి రామమోహన్ పేర్కొన్నారు. ఆదివారం కడప నగరంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చలామణిలో నుండి రూ. 2000 నోట్లను ఆర్బిఐ ఉపసంహరించుకుందని ఆయన తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న నల్ల ధనం, అవినీతి, తీవ్రవాద కార్యకలాపాలకు నిధులు అందచేయడం వంటి సమస్యలకు పరిష్కారంగా, డిజిటల్ చెల్లింపులను పెంపొందించడానికి మోడీ ఆర్భాటంగా 2016లో ప్రకటించిన పెద్ద నోట్ల రద్దును వాస్తవంగా ఈ చర్య తిప్పికొట్టిందని సిపిఎం ధృఢంగా విశ్వసిస్తున్నట్లు పేర్కొందన్నారు.


అన్ని రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. గత అనుభవాల రీత్యా చూసినట్లైతే, 2వేల నోట్లలో పేరుకుపోయిన నల్ల ధనం నిల్వలను ప్రక్షాళన చేయడం కన్నా ఈ చర్య వాటిని మరింత చట్టబద్ధం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మోడీ చేపట్టిన పెద్ద నోట్ల రద్దు చర్యతో కోట్లాదిమంది ప్రజల జీవనోపాధులు దారుణంగా దెబ్బతిన్నాయని, వందలాదిమంది జీవితాలను బలి తీసుకుందన్నారు.


పెద్దనొట్ల రద్దు తర్వాత ఎంత నల్లదనం బయటికి తీశారు అనే విషయం పై లెక్కలు చెప్పలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. ప్రధానంగా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దివాలా తీశాయని. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ప్రజానీకం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సభ్యులను చైతన్యవంతం చేయడానికి ఈనెల 29, 30 తేదీల్లో కడప నగరంలో 2 రోజుల పాటు రాజకీయ శిక్షణా తరగతులు నిర్విస్తున్నామన్నారు. ఈ శిక్షణా తరగతుల విజయవంతానికి అవసరమైన సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీపీఎం నగర కమిటీ సభ్యులు ఫారుక్ హుస్సేన్, ఎం ఆర్ నాయక్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa