ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళాశాలలో ముగిసిన ఈఆర్ఎస్ఈఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 21, 2023, 11:33 AM

ప్రొద్దుటూరు మండల పరిధి లింగాపురం గ్రామం లోని సాయిరాజేశ్వరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎమర్జింగ్ రీసెర్చ్ ఇన్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ (ఈఆర్ఎస్ఈఎం -2023) శనివారం ముగిసింది. ఈ కార్యక్రమంలో సివిల్, ఈఈఈ, మెకానికల్, ఈసీఈ, సీఎస్ఈ, ఎంబీఏ విభాలకు సంబంధించి మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ లతోపాటు పలు రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు, సైంటిస్టులు పాల్గొన్నారు. కళాశాల వైస్ ప్రెసిడెంట్ బసిరెడ్డి వీరకుమార్ రెడ్డి, కరస్పాండెంట్ వీరకళ్యాణ్ రెడ్డి మాట్లాడుతూ కాన్ఫరెన్స్లో 160 మందికి పైగా పాల్గొని తాము రూపొందించిన ప్రజెంటేషన్ ప్రదర్శించారన్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బసిరెడ్డి రాజేశ్వరరెడ్డి, ప్రిన్సిపల్ పాండురంగన్ రవి, వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరెడ్డి, అకడమిక్ డీన్ సుబ్బారెడ్డి, ఏఓ జగదీశ్వరరెడ్డి, హెచ్ ఓడీలు, అధ్యాపకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa