ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో లేని ఏసీ బస్సు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 21, 2023, 11:41 AM

పల్నాడు జిల్లాలో కేంద్రమైన నరసరావుపేట బస్టాండ్‌ పరిధిలో ఒక్క ఏసీ బస్సు కూడా లేదు. రాయలసీమతోపాటు కోస్తాంధ్ర, పొరుగునే ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు బస్సు సర్వీసులున్నా ఏసీ బస్సులు లేకపోవడంతో ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకు ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. పల్నాడు జిల్లాలో ఆరు డిపోలకు నాలుగింటిలో ఏసీ బస్సు సర్వీసులు లేవు. వాటికి డిమాండ్‌ ఉన్నా ఏర్పాటు చేయడంపై ప్రజా రవాణాశాఖ దృష్టి సారించడం లేదు.

జిల్లాలో నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల, సత్తెనపల్లి పట్టణాల్లో ప్రజా రవాణాశాఖ(ఆర్టీసీ) బస్సు డిపోలు ఉన్నాయి. ఆరు డిపోల్లో కలిపి ఆర్టీసీ బస్సులు 323, అద్దె బస్సులు మరో 114 నడుస్తున్నాయి. వినుకొండ డిపోలో రెండు, చిలకలూరిపేట డిపోలో రెండు మాత్రమే ఏసీ బస్సులు ఉన్నాయి. ఆ నాలుగు బస్సులు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నాయి. 437 బస్సులకుగాను కేవలం నాలుగు బస్సులకే ఏసీ సౌకర్యం ఉంది. మిగిలిన డిపోల్లోనూ వాటి అవసరం ఉన్నా కొత్త బస్సులు మంజూరు చేయటం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa