గత టీడీపీ పాలకుల విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్ వెనుకబడి పోయిందని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శనివారం శ్రీశైల క్షేత్రం దర్శనానికి వెళ్తూ, మార్గ మధ్యలో వినుకొండ ఆర్అండ్బీ గెస్ట్ హౌస్కు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్ల పరిపాలనలో శరవేగంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల అభివృద్ధి జరుగుతోందన్నారు. ఉత్తరాంధ్రలో ఎయిర్పోర్ట్, కోస్టల్ కారిడార్, ఏడు పోర్ట్లతో పాటు అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీఎం వైఎస్ జగన్ను అభినందించారని గుర్తుచేశారు. కేవలం అర్హత ఉంటే చాలు అన్ని సంక్షేమ పథకాలు వర్తించేలా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని, మరలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa