జిల్లా స్థాయి అటవీ హక్కుల కమిటీ ఐదు రహదారుల నిర్మాణానికి అటవీ ప్రాంతంలో అవసరమగు స్థలానికి అటవీ అనుమతులు మంజూరు చేసింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ హక్కుల కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళ వారం జరిగింది. సీతంపేట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో నిర్మిస్తున్న రహదారులకు అవసరమైన అటవీ స్థలానికి అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa