రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఖాళీగా ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమిస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణ దాస్ కృషితో నరసన్నపేట మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా దుంపల భాస్కరరావు అనే నియమిస్తూ ఆదేశాలు ఇవ్వటం జరిగిందని సంబంధిత అధికారులు గురువారం తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆశీస్సులతో పోలాకి మండలం సుసరం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ దుంపల భాస్కరరావును అధ్యక్షులుగా నియమించింది. ఉప అధ్యక్షులుగా దంత సింహాచలం నియమించారు. పాలకవర్గ సభ్యులుగా వేలాల వెంకటరమణ, అడ్ల చంద్రావతి, పాసిన సరోజిని, రావాడ అప్పన్న రాజు, గేదెల వరలక్ష్మి, తోట ముద్దమ్మ, మేడి రూపవతి, సతివాడ ఉమాదేవి, రాజాన సూరమ్మ, పంచి రెడ్డి సత్యనారాయణ, వారణాసి సత్యనారాయణ, కోరాడ చిన్న నరసింహమూర్తి లు ఉన్నారు. గౌరవ అధ్యక్షులుగా ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ కొనసాగుతారు. వీరి పదవీకాలం ఏడాది పాటు కొనసాగుతుందని త్వరలోనే వీరు పదవి బాధ్యతలు చేపడతారని అధికారులు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa