మదనపల్లి: కాణిపాకం, శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయ ఆస్థాన జ్యోతిష్య, వాస్తు, పంచాంగకర్తగా అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఆస్థాన పంచాంగ రచయిత శివకుమార్ శర్మను నియమిస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆలయ ఈవో ఎ. వెంకటేశు నియామక ఉత్తర్వులను ఆలయంలోని ఆశీర్వచన మండపంలో మంగళవారం రాత్రి అందించారు. అనంతరం ఆయన స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం ఆయనకు స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందించారు. పండితులు వేదాశీర్వచనం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa