జైల్లో ఉన్న మాజీ మంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాను గుర్తుచేసుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీలో ఓ విద్యా సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అరవింద్ కేజ్రీవాల్.. విద్యా శాఖ మంత్రిగా సిసోడియా పనితీరును గుర్తుచేసుకున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయగా.. ఇదే కేసులో ఈడీ కూడా ఆయనపై కేసు నమోదుచేసి మార్చి 9న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మనీశ్ సిసోడియాకు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘ఈ వ్యక్తులు ఢిల్లీలో విద్యా వ్యవస్థను నాశనం కావాలని కోరుకుంటున్నారు.. ప్రతి పిల్లాడికి నాణ్యమైన విద్యను అందజేయాలని మనీవ్ జీ కలగన్నారు’ అని అన్నారు. ‘నిరాధారమైన ఆరోపణలు, తప్పుడు కేసులతో అటువంటి మంచి వ్యక్తిని (సిసోడియా) అనేక నెలలుగా జైల్లో ఉంచారు.. ఆయన్ను ఎందుకు కటకటాల వెనక్కి నెట్టారు? ఈ దేశంలో అనేక మంది దొంగలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు.. వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయరు... మనీశ్ సిసోడియా పిల్లల కోసం పాఠశాలలు ఏర్పాటు.. నాణ్యమైన విద్యను అందిస్తున్నందున జైలుకు పంపారు.. నాణ్యమైన విద్య కారణంగా ఆప్ ప్రచారంతో వాళ్లు విసుగు చెందారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఢిల్లీ స్కూళ్లను ప్రజలు మెచ్చుకుంటారు’ అని
మరోవైపు, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోడియాకు హైకోర్టు రెండు రోజుల కిందట బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. తీవ్రమైన నేరారోపణలు ఉన్నందున సాక్షులను ప్రభావితం చేయగలరని వ్యాఖ్యానించింది. తన భార్య అనారోగ్యం దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని సిసోడియా అభ్యర్థించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య వారి నివాసం లేదా ఆసుపత్రిలో ఒకరోజు ఆమెను కలవడానికి అనుమతించారు. మీడియాతో మాట్లాడవద్దని షరతులు విధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa