అచ్యుతాపురం: లోని ఓ లాడ్జిలో గత నెల 29న హత్యకు గురైన సచివాలయ ఉద్యోగిని మహాలక్ష్మి కేసు కొలిక్కొచ్చింది. ఆమెను హత్యచేసింది ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీనివాసకుమారేనని పోలీసులు తేల్చారు. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ వెల్లడించిన గురువారంఅచ్చుతాపురం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల అయన వెల్లడించిన వివరాలివి. కూర్మన్నపాలెంకు చెందిన గిరిజన యువతి మహాలక్ష్మి (26) రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం సచివాలయంలో వ్యవసాయ సహాయ కురాలుగా పనిచేస్తోంది. గాజువాక అరుణోదయ కాలనీకి చెందిన ఎం. శ్రీనివాసకుమార్ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వెతైన వారం నుంచే నిందితుడి తల్లి, కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధించే వారు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. అయినా వదలకుండా శ్రీనివాసకుమార్ వేధించాడు. దీనిపై పోలీసు లకు పలుమార్లు ఫిర్యాదు చేసి విడాకులు ఇప్పిం చమని వేడుకున్నా తమ పరిధిలోని అంశం కాక పోవడంతో వారు జోక్యం చేసుకోలేదు. తనకు విడాకులు ఇచ్చేస్తే ఉద్యోగం లేని తన జీవితం దుర్భరంగా మారుతుందనే భయం, విడాకులు ఇస్తోందనే పగ, కసి పెరిగి శ్రీనివాసకుమార్ రెండు కత్తులను కొనుగోలు చేశాడు. గత నెల 20న నమ్మకంగా ఫోన్ చేసిఆమెను అచ్యుతాపురంలోని లాడ్జీకి రప్పించాడు. భోజనంలో మత్తు మాత్రలు కలిపి తినిపించాడు.
కొంత అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాతరెండు కత్తులతో ఆమె శరీరంపై ఇష్టారాజ్యంగా దాడిచే శాడు. సైకో మాదిరిగా 16 చోట్ల లోతైన గాయాలు, మరో 20 వరకు చిన్నచిన్న గాయాలు చేసి దారుణంగా చంపేశాడు. అచ్యుతాపురం సీఐ మురళీరావు, ఎస్సై సన్యాసినాయుడు వెళ్లే సమయానికి యువతి కొనఊపిరితో ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. నేరం నుంచి తప్పించుకోవాలనే ఉద్దే శంతో శ్రీనివాసకుమార్ చిన్నచిన్న గాయాలు చేసుకొని పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు. ఆ గదిలో లభించిన ఇంజక్షన్లు, మాత్రలను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాట్కు పంపించారు. మృతురాలి తండ్రి సాంబ ఫిర్యాదు మేరకు నిందితుడిపై 302 హత్యా నేరం, వరకట్నం వేధింపులు 304(బి), మహిళా హింస కింద 439, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదుచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa