మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లి, ముదిరెడ్డిపల్లి, గ్రామ పంచాయతీలలో కురిసిన అకాల వర్షం, వడగాలులకు దెబ్బతిన్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం రైతు సేవా సమితి సభ్యులతో కలసి దెబ్బతిన్న బొప్పాయి, అరటి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి ఎకరాకు దాదాపు లక్ష రూపాయలు పెట్టుబడి అయిందని పంట చేతికొచ్చి అమ్ముకునే సమయంలో ప్రకృతి వైపరీత్యా కారణంగా పంట నేలమట్టం కావడం జరిగిందని రైతులు తెలియజేశారు.
పొలాలను పరిశీలించిన అనంతరం మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయంలో అందుబాటులో ఉన్నటువంటి బద్వేల్ ఆర్డిఓ వెంకటరమణ ను రైతు సేవా సమితి సభ్యులతో కలిసి వినతి పత్రం సమర్పించి మాట్లాడుతూ. దెబ్బతిన్న అరటి, బొప్పాయి పంటలను ప్రభుత్వ అధికారులు పరిశీలించి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చేలా కృషి చేయాలని ఆర్డీవో ను కోరారు. ఈ కార్యక్రమాలలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గం అధ్యక్షులు మాడిశెట్టి సహదేవుడు, సమితి సభ్యులు, ఆవుల నాగేష్, అక్కిదారి రమేష్, కత్తి నాగిరెడ్డి, రాజా, మాధవరెడ్డి, మహిళా రైతు కోటయ్య గారి సిద్ధమ్మ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa