అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆలమూరు మండలం, మడికి జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఏపీ 35 డబ్ల్యూ 2306 నెంబర్ గల టాటా మ్యాజిక్ వాహనం రంపచోడవరం నుంచి మందపల్లి శనీశ్వరస్వామి దైవ దర్శనం కోసం పది మంది భక్తులతో వస్తోంది. అలాగే వైజాగ్ ఎయిర్ పోర్టు నుంచి ఏపీ 39సీ2266 కారులో నలుగురు భీమవరం వెళుతున్నారు. అతి వేగంగా వస్తున్న ఈ కారు టాటామ్యాజిక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్లో ముగ్గురు ప్రయాణీకులు, కారులో ఉన్న ఒకరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 9 మందిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని నలుగురి మృతదేహాలను పోస్టుమార్టమ్ కోసం మండపేట ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa