పొన్నూరు నియోజకవర్గం పరిధిలోని చేబ్రోలు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమం పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో బాబురావు పాల్గొని ఈనెల 23 నుంచి వచ్చే నెల 23 వరకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రజలకు కావలసిన సంక్షేమ పథకాల పై అవగాహన కల్పించి సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించటం తో పాటు వారు వారికి సంక్షేమం అందే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. తాసిల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ నెల రోజులు జరిగే జగనన్న సురక్ష కార్యక్రమంను అలసత్వం వహించకుండా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్టెప్ సీఈవో పల్లవి గ్రామ సచివాలయ సిబ్బందితోపాటు కార్యదర్శులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa