డిజిటల్ క్రాప్ సర్వే పైలట్ ప్రాజెక్టును అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఏపీ సహా 11 రాష్ట్రాల్లో ఆగస్టు 15 నుండి ఈ సర్వే ప్రారంభం కానుంది. దీని కోసం ఏపీకి మ్యాచింగ్ గ్రాంట్ నిధులుగా రూ. 47.59 కోట్లు కేటాయించింది. దీనికోసం కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన ఒప్పందం చేసుకుంటాయి. క్రాప్ సర్వేలో రైతు వివరాలు సేకరించి యూనిక్ ఐడీ ఇస్తారు. ఈ సర్వేతో పంటలు, వాటి ఉత్పత్తిని ఖచ్చితంగా అంచనా వేయవచ్చు.