గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రైస్ కార్డు కలిగిన వారికి ఉచిత రేషన్, సరుకులు ప్రజల ఇళ్ళ వద్దకు సరఫరా చేయుటకు ఖాళీగా ఉన్న 1 ఎండియు ట్రక్ ఆపరేటర్ భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24 నుండి 27 వరకు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయములోని ఉపాసెల్ విభాగంలో దరఖాస్తును అందజేసి రశీదు పొందవలసినదిగా తెలిపారు. దరఖాస్తుకు ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము, రెండు సంవత్సరములు పైబడి జారీచేసిన డ్రైవింగ్ లైసెన్స్లు జతచేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa