విజయవాడ దుర్గమ్మ ఆలయంలో కొత్త దందా బయటపడింది. భక్తులు కొబ్బరికాయ కొట్టడానికి కాంట్రాక్టర్ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి అంటే రూ.20 సమర్పించాల్సిందే.. ఇలా దుర్గ గుడిలో భక్తులను కాంట్రాక్టర్ సిబ్బంది నిలువు దోపిడీ చేస్తున్నారు. వారానికి రూ. లక్షా 8వేలకు టెండర్ దక్కించుకున్నట్లు సమాచారం.. బహిరంగంగా భక్తులు నుండి డబ్బులు వసూలు చేస్తున్నా దుర్గగుడి అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దుర్గగుడి చైర్మన్ అవినీతిని ప్రక్షాళన చేస్తాను అని చెప్పడమే కానీ ఎక్కడా ప్రక్షాళన కనిపించడం లేదని భక్తులు అంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి పనులపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. రూ.195 కోట్లతో నిర్వహిస్తున్నామని.. రూ.70 కోట్ల నిధుల్లో ఇప్పటికే రూ.14.70 కోట్లు మేర పలు పనులను పూర్తి చేసినట్లు చెప్పారు. అమ్మవారి కుంకుమ పూజల నిర్వహణకై రూ.6 కోట్లతో రెండు అంతస్తుల పూజా మండపాన్ని నిర్మించేందుకు టెండర్లను జూలై రెండో వారంలో పిలుస్తున్నట్లు తెలిపారు.
విజయవాడ దుర్గ గుడికి ఉచిత ప్రయాణం!
ఇటు శ్రీశైల మల్లికార్జునస్వామి వారి దేవస్థానానికి సంబంధించి రూ.75 కోట్లతో క్యూ కాంప్లెక్స్ నిర్మించనున్నట్టు మంత్రి చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 1,917 ఆలయాలను మంజూరు చేశామని.. నూతన దేవాలయాల నిర్మాణానికి, పాత దేవాలయాల పునరుద్ధరణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.450 కోట్లు సీజీఎఫ్ నిధులు విడుదల చేసిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa