ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారాహి విజయ యాత్రకు బ్రేక్,,,,రెండు రోజుల పాటూ విరామం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 28, 2023, 07:59 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు బ్రేక్ ఇచ్చారు. గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన.. బుధవారం, గురువారం వారాహి యాత్రకు విరామం ప్రకటించారు. ప్రస్తుతం పవన్ భీమవరంలో బస ఉండగా.. అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. భీమవరంలో ఈ నెల 30న జనసేన బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లపై మాత్రం నాయకులతో చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ నెల 30న భీమవరం సభ తర్వాత వారాహి యాత్రకు స్వల్ప విరామం ఇస్తున్నట్లు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అనంతరం తిరిగి ప్రారంభించి వారాహి యాత్ర రూట్ మ్యాప్‌పై నేతలతో చర్చించామన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa