మంగళగిరి పరిధి యర్రబాలెం కు చెందిన ఓ వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు యర్రబాలెం కు చెందిన పగల దుర్గారావు (48) మద్యానికి బానిసగా మారాడు. దీంతో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈనెల 22వ తేదీన దుర్గారావు తన ఇంట్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం చినకాకాని ఎన్నారై వైద్యశాలకు తరలించారు. గత వారం రోజుల నుంచి చికిత్స పొందుతున్న దుర్గారావు గురు వారం మృతి చెందాడు. మృతుని భార్య ఆదిలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa