శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం తొలిఏకాదశి పర్వదినం సందర్భంగా దేవస్థానం స్వామివారికి సహస్ర ఘటాభిషేకం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించింది. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అర్చకస్వాములు పాతాళగంగ వద్ద కృష్ణానదికి పూజలు నిర్వహించి నదీజలాలను తీసుకొచ్చారు. దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవదాయ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి సంప్రదాయబద్ధంగా కృష్ణా నదీ జలాలతో పాతాళేశ్వరస్వామివారి ఆలయంలో అభిషేక అర్చనలు నిర్వహించారు. అనంతరం జల కలశాలను తలపై పెట్టుకుని వేదమంత్రాలు నడుమ నందిగుడి, అంకాళమ్మ అమ్మవారు, బయలు వీరభద్రస్వామికి పూజలు నిర్వహిస్తూ ప్రధానాలయానికి చేరుకున్నారు. ఆషాడం సందర్భంగా మంత్రి కొట్టు అమ్మవారికి సారెను, స్వామివారి వస్త్రాలను సమర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa