డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంక ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీ ధనలక్ష్మి అమ్మవారి వార్షికోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఆలమూరు మండల వైకాపా కన్వీనర్, గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాసు ఆధ్వర్యంలో గోదావరి నది నుండి 108 కలశాలతో మహిళలు తీసుకువచ్చిన జలాలతో సహా అమ్మవారిని ముత్యాల పల్లకిలో ఉంచి బాణాసంచా వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. తెల్లవారుజాము నుండే ఆలయ ప్రధాన అర్చక స్వామి ఎం ప్రభాకర శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, పూల మాలలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారి గ్రామోత్సవం సందర్భంగా గ్రామంలోని భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa