కేంద్ర ప్రభుత్వం ఈనెల 19న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. మరికొద్ది రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో ప్రవేశపెట్టే బిల్లులు, చర్చించాల్సిన అంశాలపై చర్చించేందుకు అఖిలపక్షం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై అన్ని పార్టీలకు కేంద్రం వివరణ ఇవ్వనుంది. అలాగే, సభ సజావుగా సాగేలా సహకరించాలని అన్ని పార్టీలను కోరనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa