ప్రజల వ్యక్తిగత సమగ్ర సమాచారం చోరీకి గురవుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉండగా ప్రజల డేటాకు భద్రత కరువైందని, అప్పటి ప్రభుత్వం ప్రజల వివరాలను దొంగతనంగా, మోసపూరితంగా సేకరించి మరొకరికి చేరవేస్తోందంటూ ఆరోపణలు చేసిన జగన్, ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. డేటా చోరీ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa