ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వంపై పయ్యావుల కేశవ్ ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 16, 2023, 08:17 PM

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల విషయంలో ఏపీ ప్రభుత్వంపై పీఏసీ ఛైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ధ్వ జమెత్తారు. రూ.900 కోట్ల కుంభకోణం బట్టబయలవడంతో తాడేపల్లి పెద్దలకు నిద్ర కరవైందని అన్నారు. రుణం తీసుకున్నది రాయలసీమ ప్రాజెక్టు ఇన్వెస్ట్ గేషన్ పనులకో? ప్రాజెక్టు నిర్మాణ పనులకో తేలాలి అని డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చేయబోమని కోర్టును మోసం చేశారని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చేయబోమని కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన పీఎఫ్ సీకి, ఆర్ ఐసీకి  తెలుపకుండా మోసం చేసి రుణం తెచ్చారని పయ్యావుల ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణానికి తెచ్చిన రూ.7 వందల కోట్లలో ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ కు వంద కోట్లు పోయినా... మిగతా 6 వందల కోట్లు ఎక్కడికి వెళ్లాయి? అని ప్రశ్నించారు. కోర్టులను, ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతోందని పయ్యావుల తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ ప్రాజెక్టు పనుల నిధుల వినియోగం సరిగా జరగడంలేదని, నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అందుకే సీబీఐకి లేఖ రాస్తున్నామని తెలిపారు. సీబీఐ విచారణకు మంత్రి అంబటి రాంబాబు ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa