బీజేపీ చేతిలో వైసీపీ, టీడీపీ పార్టీలు కీలుబొమ్మలేనని ఏపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి చెప్పారు. వైసీపీ, టీడీపీ దొందూ దొందేనని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. బుందేల్ ఖండ్ తరహా అభివృద్ధి ప్యాకేజీని రాయలసీమకు, ఉత్తరాంధ్రకు సాధించడంలో విఫలమయ్యాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు, విజయవాడ మెట్రో, విశాఖ మెట్రో, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు వంటి అంశాల్లో కూడా విఫలమయ్యాయని చెప్పారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనే విధంగా వ్యవహరిస్తుండటం బాధాకరమని అన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలు కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa