ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాయిలెట్‌ కోసం వందే భారత్ రైలు ఎక్కి ఫైన్ వేయించుకున్న వ్యక్తి

national |  Suryaa Desk  | Published : Thu, Jul 20, 2023, 09:04 PM

టాయిలెట్ కోసం వందే భారత్ రైలు ఎక్కి ఓ ప్రయాణికుడు అందులోనే చిక్కుకుపోయాడు. రైల్వే స్టేషన్‌లో ఉన్న టాయిలెట్స్‌కు వెళ్తే డబ్బులు చెల్లించాల్సి వస్తుందని భావించాడో ఏమో.. ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న వందే భారత్‌ రైలు ఎక్కేశాడు. ఇంతలో ఆ రైలు డోర్లు కాస్త మూసుకుపోయి.. వందే భారత్ పరుగులు పెట్టింది. దీంతో ఖంగుతిన్న ఆ ప్రయాణికుడు.. టాయిలెట్ నుంచి బయటికి వచ్చేసరికి రైలు కదిలింది. దీంతో టీటీఈ వద్దకు వెళ్లి విషయం చెప్పడంతో ఫైన్ వేసి.. తర్వాతి స్టేషన్‌లో దించేశాడు. టాయిలెట్ కోసం వందే భారత్ రైలు ఎక్కిన ఆ ప్రయాణికుడు.. ఫైన్, రానుపోను ఛార్జీలు కలిపి మొత్తం రూ. 6 వేలు సమర్పించుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.


మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీకి చెందిన ఓ వ్యక్తికి ఈ అనుభవం ఎదురైంది. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌ నుంచి భోపాల్‌ రైల్వే స్టేషన్‌లో దిగాడు. అక్కడి నుంచి సింగ్రౌలీ వెళ్లేందుకు మరో రైలు కోసం.. భోపాల్ రైల్వే స్టేషన్‌లో వేచి ఉన్నాడు. అయితే అదే సమయంలో ఆ ప్రయాణికుడికి టాయిలెట్ వచ్చింది. ఇంతలో అక్కడికి ఓ వందే భారత్ రైలు వచ్చి ఆగింది. దీంతో రైల్వే స్టేషన్‌లోని టాయిలెట్స్‌లోకి వెళ్తే డబ్బులు చెల్లించాల్సి వస్తుందనుకున్నాడో లేక.. పక్కనే ఉంది కదా అని ప్లాట్‌ఫామ్‌పై ఉన్న వందే భారత్ రైలు ఎక్కేశాడు. అనంతరం అందులోని టాయిలెట్‌లోకి వెళ్లి మూత్రం పోసి బయటికి వచ్చాడు. అయితే అప్పటికే ఆ వందే భారత్ రైలు డోర్లు మూసుకుపోయి.. అది బయల్దేరింది. దీంతో ఆ ప్రయాణికుడు ఆ రైలులోనే చిక్కుకుపోయాడు. ఏం చేయాలో అర్థం కాక.. ఆ రైలులో ఉన్న టీటీఈని కలిశాడు. విషయం మొత్తం తెలుసుకున్న టీటీఈ ఆ ప్రయాణికుడికి ఫైన్ వేసి.. తర్వాతి స్టేషన్‌లో దించేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.


భోపాల్‌లో బయల్దేరిన ఆ వందే భారత్ రైలు ఉజ్జయిని స్టేషన్‌లో ఆగుతుందని ఆ ప్రయాణికుడికి టీటీఈ చెప్పాడు. దీంతో చేసేదేం లేక అతను రైలు లోపలే ఉండిపోయాడు. టికెట్‌ లేకుండా వందే భారత్ రైలు ఎక్కినందుకు ఫైన్ కింద ఆ ప్రయాణికుడి నుంచి టీటీఈ రూ. 1,020 వసూలు చేశాడు. అనంతరం రైలు ఉజ్జయిని స్టేషన్‌లో ఆగడంతో అక్కడ దిగిపోయాడు. దీంతో తన కుటుంబ సభ్యులు భోపాల్‌ స్టేషన్‌లోనే ఉండడంతో.. మళ్లీ ఉజ్జయిని నుంచి భోపాల్‌కు బస్సులో పయనమ్యయాడు. అప్పటికే వారు భోపాల్ నుంచి సింగ్రౌలీకి వెళ్లాల్సిన రైలు వెళ్లిపోయింది.


అవసరంగా వందే భారత్ రైలు ఎక్కినందుకు అతని భారీగా లాస్ అయింది. వందే భారత్ రైలు ఫైన్ రూ. 1020.. ఉజ్జయిని నుంచి తిరిగి భోపాల్‌కు రావడానికి బస్సు ఛార్జీలు రూ. 750.. భోపాల్ నుంచి సింగ్రౌలీ వెళ్లే రైలు వెళ్లిపోవడంతో దాని కోసం బుక్‌ చేసుకున్న టికెట్లు పనికి రాకుండా పోయాయి. ఆ టికెట్ ఛార్జీల విలువ రూ. 4 వేలు. దీంతో ఒక్క చిన్న పొరపాటుతో మొత్తం రూ. 6 వేల వరకు ఆ వ్యక్తి నష్టపోయాడు. అయితే ఈ ఘటనపై భోపాల్‌ రైల్వే స్టేషన్‌ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో కూడా ఓ వ్యక్తి వందే భారత్ రైలును చూద్దామని.. స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు ఎక్కాడు. అందులోకి వెళ్లగానే ఆటోమెటిక్ డోర్లు మూతపడటంతో అందులోనే చిక్కుకుపోయాడు. రైలు ఆపాలని సిబ్బందిని ఎంత వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఫైన్‌ చెల్లించి తర్వాతి స్టేషన్‌లో దిగిపోయాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa