ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల విభజన నేపథ్యంలో కొత్త జోనల్ వ్యవస్థలు, ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ భేటీ వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో పంచుకున్నారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై కసరత్తు చివరి దశలో ఉందని, త్వరలోనే విధివిధానాలు ఖరారు చేస్తామని వెల్లడించారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై కార్మిక సంఘాలను తప్పకుండా సంప్రదిస్తామని చెప్పారు .రాష్ట్రంలో త్వరలో కారుణ్య నియామకాలు చేపడతామని మంత్రి బొత్స తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఆగస్టు 7న జీవో జారీ చేస్తామని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa