జగన్ సీఎం అయ్యాక డ్వాక్రా సంఘాలకు మంచి రోజులు వచ్చాయని మంత్రి ఆర్.కె.రోజా పేర్కొన్నారు. చంద్రబాబు దెబ్బకి ఏ గ్రేడ్ లో ఉన్న సంఘాలు కూడా సీ , డీ గ్రేడ్లలోకి పడిపోతే.. ఎన్పీఏలు 18.36% చేరాయన్నారు. అటువంటి డ్వాక్రా సంఘాలు మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాణం పోసుకున్నాయన్నారు. ఒక్క వైఎస్సార్ ఆసరానే కాదు సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేస్తూ, అత్యధికంగా రికార్డ్ స్థాయిలో రుణాలు ఇప్పిస్తూ డ్వాక్రా మహిళల తలరాతలను మార్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఇంకో వైపు వైఎస్సార్ చేయూత పథకాన్ని కూడా జగనన్న అమలు చేస్తూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 75 వేలను వారి స్వయం ఉపాధికి అందిస్తున్నారన్నారు.
వైఎస్సార్ చేయూత ద్వారా 26 లక్షల మంది మహిళలకు స్వయం ఉపాధి కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని గర్వంగా చెప్పగలను అన్నారు రోజా. సీఎం జగన్ మహిళల కోసం ఇంత గొప్పగా ఆలోచన చేస్తుంటే చంద్రబాబు తాను మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలను ఉద్దరిస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ 44 లక్షల మందికి అమ్మ ఒడి అమలు చేశారని.. 80 లక్షల మందికి డ్వాక్రా మహిళలకు ఆసరా ఇస్తున్నారన్నారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య మహిళలకు 26 లక్షల మందికి చేయూతను ఇచ్చారని తెలిపారు. ఆడపిల్లల చదువుకోసం విద్యా దీవెన ఇస్తున్నారు, సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నారని.. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలిచ్చారన్నారు.
గతంలో చంద్రబాబు డ్వాక్రా మహిళలకు టోకరా పెట్టారని.. మొత్తం రూ.14,200 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారన్నారు. ఈ విషయాన్ని అక్కచెల్లెమ్మలు మర్చిపోలేదని.. ఆడవాళ్ల బంగారం బ్యాంకుల నుండి విడిపిస్తానని మోసం చేసిన మాయమాటలు.. ఒకవైపు రుణాలు మాఫీ చేస్తానని చేయకపోగా, అక్టోబర్ 2016 నుండి సున్నావడ్డీ పథకం సైతం ఎగ్గొట్టారని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం సుమారు రూ. 3,036 కోట్ల వడ్డీని అక్కచెల్లెమ్మలే బ్యాంకులకు అపరాధపు వడ్డీతో సహా చెల్లించాల్సిన దుస్ధితి కల్పించారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా ద్రోహి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa