ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం,,,,అయోధ్యలోని హోటళ్లకు అడ్వాన్స్ బుకింగ్ తాకిడి

national |  Suryaa Desk  | Published : Fri, Jul 21, 2023, 10:47 PM

ఎన్నో దశాబ్దాలుగా నలిగి ఉన్న అయోధ్య అంశం 2019 లో సుప్రీంకోర్టు తీర్పుతో పరిష్కారం అయ్యింది. దీంతో అప్పటి నుంచి రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగాయి. దీంతో వచ్చే ఏడాది జనవరిలో అయోధ్యలో దివ్యమైన, భవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అయోధ్య రామ మందిర నిర్మాణ కమిటీ చెప్పేసింది. దీంతో జనవరిలో అయోధ్య రామ మందిరంలో విగ్రహాల ప్రతిష్ఠ చేయనున్నారు. దీంతో దానికి సంబంధించి పనులు, ఏర్పాట్లు ఇప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. దీంతో అయోధ్య, చుట్టు పక్కన ఉన్న ప్రాంతాల్లో హోటళ్లకు ఇప్పటి నుంచే అడ్వాన్స్ బుకింగ్‌లు చేస్తున్నట్లు అక్కడి హోటళ్ల నిర్వాహకులు వెల్లడించారు.


అయోధ్యలో మరి కొన్ని రోజుల్లోనే రాముని దర్శనం భక్తులకు కలుగనుంది. ఇప్పటికే ఆలయానికి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. దీంతో వచ్చే జనవరి నాటికి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపనకు రామ మందిర నిర్మాణ కమిటీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇక అయోధ్య రాముడిని చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఆలయ కమిటీ చెప్పిన గడువు దగ్గరికి వస్తున్న వేళ.. భక్తులు ఇప్పటి నుంచే అయోధ్య పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మొదలుపెట్టారు. ముఖ్యంగా ఏ కొత్త ప్రదేశానికి వెళ్లినా ముందుగా కావాల్సింది వసతి. కాబట్టి ఇప్పటి నుంచే అక్కడ ఉన్న హోటళ్ల గురించి ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యతోపాటు దాని చుట్టుపక్కల ఉన్న పట్టణాలు, నగరాల్లో హోటళ్లలో అడ్వాన్స్ బుకింగ్‌లు మొదలయ్యాయన ఆయా హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు.


అయోధ్యలో 2024 జనవరి మూడో వారంలో రామ మందిరంలో విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ఇటీవల వెల్లడించింది. ఇందులో అతి ముఖ్యమైన శ్రీరామచంద్ర విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22 వ తేదీన చేపట్టనున్నట్లు తెలిపింది. శ్రీరామచంద్ర విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తైన తర్వాత.. స్వామిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా దేశంలోని చాలా మంది ప్రముఖులు హాజరు కానున్నారు. దీంతో అయోధ్య.. ఆ చుట్టుపక్కల ఉన్న హోటళ్లు, రిసార్టులు ఇప్పటినుంచే ముందస్తు బుకింగ్‌లు ప్రారంభించాయి. దాదాపు 10 నుంచి 12 రోజుల పాటు సాగే ఈ అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరు అవుతారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక హోటళ్ల నిర్వాహకులతో అయోధ్య నగర ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు.


ఫైజాబాద్‌లో దాదాపు 150 హోటళ్లు ఉన్నాయి. ఇక అయోధ్యలో 10 లగ్జరీ, 25 బడ్జెట్‌, 115 ఎకానమీ హోటళ్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవే కాకుండా 35 గుర్తింపు పొందని గెస్ట్‌హౌస్‌లు, 50 ధర్మశాలలు, 50 పేయింగ్‌ గెస్ట్‌ హౌస్‌లు కలిపి అయోధ్య జిల్లాలో మొత్తం 10 వేల రూమ్‌లు ఉంటాయని అయోధ్య నగర అధికారులు అంచనా వేస్తున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా వారికి వసతులు కల్పించడం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలకు సంబంధించి హోటళ్ల యాజమాన్యాలకు విధివిధానాలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa