ఏపీలోని మహిళలు మణిపూర్ లోని మహిళల కంటే దారుణమైన స్థితిలో ఉన్నారని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత విమర్శించారు. గత ఎన్నికల సమయంలో ముద్దులు పెట్టి, బుగ్గలు నిమిరి ఓట్లు వేయించుకున్న జగన్ మహిళా ద్రోహి అని ఆమె మండిపడ్డారు. జగన్ పాలనలో మహిళలంతా ఎంతో బాధలో ఉన్నారని... మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం సంతోషంగా ఉన్నారని చెప్పారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవీకాలం ముగిసిన తర్వాత కూడా పదవిలోనే ఉన్నాననే భ్రమలో ఉన్న వాసిరెడ్డి పద్మ కూడా సంతోషంగానే ఉన్నారని అన్నారు. ఏపీలో మహిళలు ఎదుర్కొంటున్న బాధల గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడితే... పవన్ భార్యల గురించి జగన్ మాట్లాడతారని దుయ్యబట్టారు. పిల్లలను తల్లులు పెంచే తీరు సరిగా లేదని ఒక మంత్రి... ఒకటి, రెండు అత్యాచారాలకే ఇంత రాధ్దాంతమా అని మహిళా మంత్రులు మాట్లాడుతుండటం దారుణమని అన్నారు.పోలీస్ స్టేషన్లకు వెళ్లినా న్యాయం జరగడం లేదని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa