వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్పష్టం చేశారు. తనకు ఆయన రాజకీయ గురువని అన్నారు. రామచంద్రాపురం ఎమ్మెల్యే టికెట్ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే నడుచుకుంటానని స్పష్టం చేశారు.
వేణుగోపాలకృష్ణ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లయిన సందర్భంగా ఆయన వర్గీయులు కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేణు మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యలపై స్పందించబోనని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం టికెట్పై వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మళ్లీ టికెట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థి (ఇండిపెండెంట్)గా పోటీచేస్తానని ప్రకటించారు. వైసీపీ కార్యకర్తలు, కేడర్ వద్ద మంత్రి వేణుగోపాల్ ఎన్ని రోజులు నటిస్తారని ప్రశ్నించారు.
తమను మంత్రి వేణు గోపాలకృష్ణ చెప్పు కింద బతికే వాళ్లమని అనుకుంటున్నారా అని పిల్లి సుభాస్ చంద్రబోస్ వైసీపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్తోనే ఉన్నామని చెప్పారు. మంత్రి వేణుగోపాల కృష్ణ, తనను సమావేశపరుస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. క్యారెక్టర్ లేని వ్యక్తితో కూర్చోబోనని తేల్చి పిల్లి సుభాష్ చంద్రబోస్ తేల్చిచెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa