భారీ వర్షాల కారణంగా ముంబై విశ్వవిద్యాలయం నగరంలో గురువారం జరగాల్సిన అన్ని పరీక్షలను రద్దు చేసింది. కొత్త తేదీని తర్వాత ప్రకటిస్తామని యూనివర్సిటీ తెలిపింది. "భారీ వర్షం కారణంగా రేపటి జులై 27, 2023 అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు, యూనివర్సిటీ డిపార్ట్మెంట్స్ హెడ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్, డైరెక్టర్, రత్నగిరి, థానే & కళ్యాణ్ సబ్ సెంటర్ డైరెక్టర్ మరియు సంబంధిత అన్ని అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్కి తెలియజేయడం జరిగింది. మంగళవారం వాతావరణ శాఖ జారీ చేసిన 'రెడ్ అలర్ట్' మధ్య రాయ్గఢ్ జిల్లాలోని అన్ని పాఠశాలలు మరియు కళాశాలలకు అధికారులు గురువారం వరకు సెలవు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa