బంగ్లాదేశ్కు చెందిన మహిళ.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన వ్యక్తిని ఫేస్బుక్లో చూసి ప్రేమించింది. అనంతరం భారత్కు వచ్చి పెళ్లి చేసుకుంది. అయితే తర్వాత ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఉద్యోగం కోసం ఇతర రాష్ట్రానికి వెళ్లిన ఆ వ్యక్తికి సంబంధించిన ఫొటోలు అతని తల్లికి చేరాయి. అయితే ఆ ఫొటోల్లో అతడిని హింసించినట్లు ఉండటంతో ఏం జరుగుతుందో అర్థం కాక.. అతని తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ ఘటన కాస్త వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆ వ్యక్తిని గుర్తించి తీసుకువచ్చారు.
ఉత్తర్ప్రదేశ్ మొరాదాబాద్కు చెందిన అజయ్కి 2017 లో ఫేస్బుక్లో బంగ్లాదేశ్కు చెందిన జూలీ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. 2022 లో జూలీ భర్త చనిపోగా.. ఆమెను పెళ్లి చేసుకునేందుకు అజయ్ సిద్ధమయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ నుంచి ఉత్తర్ప్రదేశ్కు వచ్చిన జూలీకి.. అజయ్తో కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం జరిగింది. ఆ తర్వాత ఉద్యోగం కోసం అజయ్ కర్ణాటకకు వెళ్లాడు. తన భార్యను ఇంటి వద్దే ఉంచడంతో అత్తాకోడళ్లకు గొడవలు మొదలయ్యాయి. అవి కాస్త పెరగడంతో జూలీ తన పుట్టింటికి వెళ్లింది. కొన్ని రోజులకు ఇంటికి వచ్చిన అజయ్.. తన భార్య వెళ్లిపోవడంతో తల్లితో గొడవకు దిగాడు. దీంతో అజయ్ని కూడా ఇంటి నుంచి వెళ్లిపోవాలని తల్లి హెచ్చరించడంతో అతడు వెళ్లిపోయాడు.
అయితే ఇటీవల అజయ్ని హింసిస్తున్నట్లు.. అతనికి రక్తం వస్తున్న ఫొటోలు అతని తల్లికి వచ్చాయి. దీంతో ఆ ఫొటోలను తీసుకువెళ్లి.. ఆమె ఉత్తర్ప్రదేశ్ పోలీసులను ఆశ్రయించింది. తన కొడుకు.. కోడలి కోసం వెళ్లి బంగ్లాదేశ్లో నరకయాతన అనుభవిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చివరికి అజయ్ని భారత్కు రప్పించారు. అనంతరం పోలీసుల ముందుకు వచ్చిన అజయ్.. తాను బంగ్లాదేశ్ వెళ్లలేదని.. పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నట్లు వివరించాడు. అయితే అతని ఒంటిపై ఉన్న గాయాల గురించి పోలీసులు ప్రశ్నించగా.. వింత సమాధానం ఇచ్చాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు తాను కాలుజారి పడిపోయానని.. అందుకే తన తలకు బలమైన గాయం అయిందని పోలీసులకు తెలిపాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా సమాధానం చెప్పాడు.
పోలీసుల విచారణలో తాను బంగ్లాదేశ్కు వెళ్లినట్లు అజయ్ అంగీకరించాడు. అయితే బంగ్లాదేశ్లో ఏం జరిగింది.. అతని ఒంటిపై గాయాలు ఎలా అయ్యాయి అనే వాటి పూర్తి వివరాలు మాత్రం మాత్రం బయటకి రాలేదు. మీడియాతో కూడా తాను పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోనే ఉన్నట్లు అజయ్ వెల్లడించాడు. పోలీసులు కూడా అజయ్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు.. ఈ కేసులో ఎలా ముందుకు వెళ్తారు అనే దానిపై ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే ఈ ఘటనపై స్పందించిన యూపీ పోలీసులు.. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa