ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టా ముక్కను ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్ ట్రైన్,,,నెల్లూరు జిల్లాలో ట్రైన్‌కు తప్పిన పెను ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 30, 2023, 06:26 PM

నెల్లూరు జిల్లాలో ఓ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. గుర్తు తెలియని వ్యక్తులు రైలు పట్టాను అడ్డుగా పెట్టారు. ఈ పట్టా ముక్కును వేగంగా వస్తున్న ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పట్టా ముక్క దూరంగా పడిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కావలి, బిట్రగుంట రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.


నర్సాపూర్ నుంచి ధర్మవరంకు ఆదివారం ఉదయం ఓ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వెళుతుంది. నెల్లూరు జిల్లాలో ఉన్న కావలి, బిట్రగుంట రైల్వే స్టేషన్ల మధ్యలో ముసునూరు వద్ద పట్టా ముక్కను వేగంగా వచ్చి ఢీకొట్టింది. వేగంగా ఢీకొనడంతో అదృష్టవశాత్తూ పట్టా ముక్క దూరంగా పడిపోవడంతో ప్రమాదం తప్పినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పట్టా ముక్క రెండు మీటర్ల పొడవు ఉండగా.. గుర్తుతెలియని వ్యక్తులు కావాలని అడ్డుగా పెట్టినట్లు రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. లోక్ పైలట్ సమాచారంతో రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.


అలాగే రైల్వే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. పట్టాలను ఎవరు అడ్డుగా పెట్టారనే దానిపై ఆరా తీస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారిని ప్రశ్నిస్తున్నారు. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. రైలు పట్టా దూరంగా పడటంతో ప్రమాదం తప్పదని, లేకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేదని సిబ్బంది చెబుతున్నారు. ప్రమాదం తప్పడంతో రైల్వే సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa