ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్ట్ 21, 22 తేదీల్లో ఏపీ ఎన్జీవో సమావేశం.. సీఎం జగన్ జగన్ హాజరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 30, 2023, 09:46 PM

పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీ నాటికి పింఛన్‌ చెల్లించాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కోరారు. ఏలూరులోని ఏపీ ఎన్జీవోల సమావేశంలో పాల్గొన్న బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 21, 22 తేదీల్లో విజయవాడలో జరిగే 21వ కౌన్సిల్‌ సమావేశాల్లో ఉద్యోగులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.


కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు సరిపోక ఇబ్బందులు పడుతున్నారని బండి శ్రీనివాసరావు అన్నారు. వారి వేతనాలు పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ బకాయిలు తక్షణమే విడుదల చేయాలన్నారు. ఉద్యోగులకు ఓపీఎస్‌ వచ్చే వరకు ఏపీ ఎన్జీవో ఉద్యమిస్తుందని బండి శ్రీనివాసరావు తెలిపారు. గతంలో నుంచి ఉద్యోగుల కౌన్సిల్‌ సమావేశాలకు ముఖ్యమంత్రులు హాజరు కావడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. ఈ సారి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు ఎపీ ఎన్జీవో కౌన్సిల్ సమావేశానికి హాజరుకానున్నట్లు బండి శ్రీనివాసరావు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa