ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యాయం చెయ్యండి అంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 04, 2023, 02:51 PM

పశ్చిమగోదావరి జిల్లా, మొగల్తూరుకు చెందిన తివారి శారదావతి అనే మహిళ సీఎం  క్యాంపు కార్యాలయం సమీపంలో  ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళ్ళితే....  ఈమె ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తోంది. కాగా మొగల్తూరులో తనకు చెందిన రెండు ఎకరాల 40 సెంట్ల భూమిని ఆమె భర్త వేణుప్రసాద్‌ దాయాదులు అమ్మేసుకున్నారని ఆమె ఆరోపిస్తోంది. ఈ విషయమై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్‌ స్పందనలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడంతో ముఖ్యమంత్రిని కలవడానికి తాడేపల్లి వచ్చినట్టు తెలిపింది. కాగా సీఎం క్యాంపు కార్యాలయం వద్ద స్పందనలో అర్జీ ఇవ్వాలని అక్కడి సిబ్బంది ఆమెకు తెలిపారు. సీఎంను కలవనివ్వడం లేదని బాధితురాలు వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై చల్లుకోవడంతో.. గమనించిన భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకొని తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాడేపల్లి సీఐ శేషగిరిరావు శారదావతికి కౌన్సెలింగ్‌ ఇచ్చి బంధువులకు అప్పగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa