రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నాయుడు నాశనం చేశారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవస్థలన్నింటికీ జీవం పోశారని చెప్పారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్లు వలంటీర్లపై ఇష్టానుసారం మాట్లాడుతుండటం దారుణం అన్నారు. కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ఆ సమయంలో చంద్రబాబు, పవన్ ఎక్కడికి పారిపోయారని నిలదీశారు. కరోనా సమయంలో సేవలు అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ బెస్ట్ స్టేట్గా నిలిచిందని గుర్తు చేశారు. ఈ అంశం ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగ్గదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa