చిత్తూరు జిల్లా, నగరిలో ఈనెల 25న సీఎం జగన్ పర్యటించనున్నారు. జగనన్న విద్యాదీవెన నిధుల విడుదలకు బటన్ నొక్కనున్నారు. సీఎం పర్యటన విజయవంతానికి అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జేసీ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం ఆయన ఏఎస్పీ సుధాకర్, డీఆర్వో రాజశేఖర్తో కలిసి ముఖ్య అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కాగా, నగరిలో సీఎం సభ కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం, పార్కిన్స్ కంపెనీ స్థలాన్ని, సాయిబాబా ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని బుధవారం కలెక్టర్ షన్మోహన్, ఎస్పీ రిషాంత్రెడ్డి పరిశీలించారు. ఆర్డీవో సృజన, తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, సీఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa