ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మతం పేరుతో రాజకీయాలు చేయొద్దు....గులాంనబీ ఆజాద్

national |  Suryaa Desk  | Published : Fri, Aug 18, 2023, 09:15 PM

దేశంలోని మెజార్టీ ముస్లింలు హిందుత్వం నుంచి మారినవారేనని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్‌ అన్నారు. ఇందుకు, కశ్మీరీ పండిట్లే ఉదాహరణ అని పేర్కొన్నారు. లోయలోని చాలా మంది పండిట్లు ఇస్లాంలోకి మారారని ఆజాద్ చెప్పారు. హిందూమతం చాలా ప్రాచీనమైందని, ఇస్లాం మతం కేవలం 1,500 ఏళ్ల కిందట నుంచి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, కొంత మంది ముస్లింలు వేరే ప్రాంతాల నుంచి వచ్చారని బీజేపీ నేతలు అంటారని, అలా వచ్చిన వాళ్లు 10 నుంచి 20 మందే ఉంటారన్నారు. అంతేకాదు, 600 సంవత్సరాల కిందట కశ్మీర్‌లో ఎవరు ముస్లిం ఉన్నారా? అని ఆయన వ్యాఖ్యానించారు.


గురువారం ఆయన దోడా జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ‘హిందూమతం చాలా ప్రాచీనమైంది.. ఇస్లాం మతం కేవలం 1,500 ఏళ్ల కిందట నుంచి ఉంది. కొంతమంది ముస్లింలు వేరేచోట్ల నుంచి వచ్చారని బీజేపీ నేతలు చెబుతుంటారు. అలా వచ్చినవారు మొఘల్ సైన్యంలోని 10-20 మంది ఉంటారేమో. ఇతర ముస్లింలంతా హిందూమతం నుంచి మారినవారే.. 600 ఏళ్ల కిందట కశ్మీర్‌లో ముస్లింలు ఎవరున్నారు?.. అంతా కశ్మీర్‌ పండిట్లే. వారు ఇస్లాంలోకి మారారు... హిందువులు చనిపోయినప్పుడు మృతదేహాలను దహనం చేసి, చితాభస్మాన్ని నదీజలాల్లో కలుపుతారు.. ఆ నీటినే మనం తాగుతాం..


ముస్లింల మృతదేహాలు ఈ నేలలో కలిసిపోతాయి.. భరతమాత నేలలోనే హిందువులు, ముస్లింలు కలిసిపోతారు. మరి వారి మధ్య తేడా ఏముంది?’ డెమొక్రాటిక్ ప్రోగ్రసివ్ అజాద్ పార్టీ (డీపీఏపీ) అని ఆజాద్‌ ప్రశ్నించారు. ‘రాజకీయాల్లో ఎవరు మతాన్ని ఆశ్రయించినా వారు బలహీనులే... రాజకీయాల్లో మతాన్ని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోకూడదు.. హిందూ, ముస్లిం పేర్లతో ఓటు వేయకూడదు’ అని వ్యాఖ్యానించారు. గతేడాది కాంగ్రెస్ పార్టీని వీడిన అజాద్.. సొంతంగా డీపీఏపీ పేరుతో రాజకీయ పార్టీని ఆజాద్ ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa