కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీనివాసుని దర్శనం కోసం 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 61,904 మంది భక్తులు దర్శించుకోగా.. 31,205 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.42 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa