ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గిరిజన విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2023, 12:05 PM

 ఈ నెల 25 న కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.య‌స్.జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తార‌ని  రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యా శాఖా మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్  కూడా పాల్గొంటారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పై విద్యా శాఖా మంత్రి , ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి రాజన్న దొర, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్.పి దీపిక లతో కలసి అన్ని శాఖల అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో  సమావేశం ఏర్పాటు చేసి ఏర్పాట్లు పై తగు సూచనలను జారీ చేశారు. తక్కువ సమయం ఉన్నందున  అధికారులంతా  సమన్వయంతో పని చేయలన్నాయారు. వర్షం పడే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. వేదిక వద్ద, బహిరంగ సమావేశం వద్ద,  పార్కింగ్ వద్ద, తాగు నీరు మెడికల్ కిట్లను, అంబులెన్స్ వాహనాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారుల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా చూడాలన్నారు. ఇప్పటికే 30 కోట్ల రూపాయ‌ల పరిహారాన్ని యూనివర్సిటీ భూముల కోసం అందజేశామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర  మీడియా తో మాట్లాడుతూ.. గిరిజన యూనివర్సిటీ ఆశ నెరవేరబోతోందని,  రాష్ట్ర విద్యా శాఖా మంత్రి కృషి కి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.  రాష్ట్రానికి చుట్టుపక్కల ఉన్న గిరిజన ప్రజలకు  ఈ యూనివర్సిటీ అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమం విజయవంతంగా జరిపిస్తామన్నారు.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa