తిరుమల తిరుపతి దేవస్థానం పేరు చెప్పి ఢిల్లీలో లాబీయింగ్ చేయడంలో ధర్మారెడ్డి ఆరితేరారు. అందుకనే ఆయనను ఆ ఆలయ ఈవో పదవిలో కొనసాగిస్తున్నారు. ఆయన ఆంధ్ర కేడర్ అధికారి కాదు. అయినా ధర్మారెడ్డిని ఈవోగా కొనసాగుతున్నారంటే లాబీయిస్టుగా ఆయనను వైసీపీ ప్రభుత్వం సమర్థవంతంగా వాడుకోవాలనుకోవడమే కారణం’’ అని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈమేరకు శనివారం వర్ల రామయ్య ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘వైఎస్ కుటుంబం ఎప్పుడు అధికారంలో ఉన్నా ధర్మారెడ్డిని తెచ్చి టీటీడీలో ముఖ్యమైన పదవిలో కూర్చోబెడుతోంది. ఈసారి ఏకంగా ఈవోను చేశారు. జగన్ తరఫున ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ఆయనను వాడుకొంటున్నారు. టీటీడీ గత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్రైస్తవుడు. ఆయన పదవీకాలం పూర్తి కాగానే ఒక నాస్తికుడిని తెచ్చి ఆ పదవిలో కూర్చోబెట్టారు. భూమన కరుణాకర్రెడ్డి తనకు ఏ మతం లేదని బహిరంగంగా చాటుకొన్నారు. రాడికల్స్లో పనిచేసిన ఆయన ఎమర్జెన్సీలో అరెస్టు కూడా అయ్యారు. ఈవో, చైర్మన్ ఇద్దరూ టీటీడీ పదవులకు తగరు. వారిద్దరినీ తక్షణమే తొలగించాలి’’ అని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa