ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా పాఠశాలని పట్టించుకోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2023, 03:58 PM

డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గంలో పాఠశాల దుస్థితిపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. చిత్తూరు జిల్లా, పెనుమూరు మండలం సన్యాసిపల్లి మండల పరిషత్ పాఠశాల కూలిపోయే స్థితిలో ఉంది. పాఠశాలలోని విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని, తలకి హెల్మెట్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కూలిపోయే దీన స్థితిలో ఉన్న తమ పాఠశాలపై సీఎం జగన్ మామయ్య దృష్టి పెట్టాలని విద్యార్థుల మొరపెట్టుకుంటున్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి తాతయ్య మా పాఠశాలను బాగు చేయాలంటూ విద్యార్థులు నిరసన తెలిపారు. మా ప్రాణాలు పోయే పరిస్థితుల్లో పాఠశాల భవనాలు ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa