పాలకుల అవినీతిని, అసమర్ధతను ప్రజల దృష్టికి తెచ్చే మీడియా సంస్థల మీద పగబట్టడం ప్రజాస్వామ్యానికే ముప్పు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈనాడు మీద పగబట్టి, ఆ పగను మార్గదర్శి సంస్థలపై తీర్చుకుంటున్న జగన్ రెడ్డి శాడిజాన్ని ప్రజలంతా చూస్తున్నారన్నారు. తన చేతిలో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నింటినీ పగ తీర్చుకోవడం కోసం జగన్ వాడుకోవడం చూస్తే... ఆ సైకో చేష్టల పట్ల ప్రజలకు జుగుప్స కలుగుతోందని వ్యాఖ్యలు చేశారు. ఇదంతా చేస్తున్నది ప్రజల శ్రేయస్సు కోసమే అనుకుంటే పోలవరం కట్టాలని... రాజధాని అమరావతిని నిర్మించాలని డిమాండ్ చేశారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకానీ ప్రజలను చైతన్యవంతం చేస్తున్న మీడియా అధిపతులను వేధించకండి అంటూ లోకేశ్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa