ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 22 నుంచి నుంచి 25 వరకు ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ క్యాంపులు అందుబాటులో ఉంటాయి. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు లబ్ధి దారుల ఎంపిక ప్రక్రియలో ఆధార్ కీలకమనే చెప్పాలి. ఈ క్రమంలో ఆధార్లో తప్పులు కారణంగా అర్హులెవరూ ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఈ నెల 22 నుంచి స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ అన్ని రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో పాటు ఆయా జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇంఛార్జ్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ కనీసం పదేళ్ల వ్యవధిలో ఒక్కసారైనా తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ కొత్తగా నిబంధనలు తీసుకొచ్చింది. ఆధార్ అనుసంధానంతో కూడిన పథకాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వివరాలను మరోసారి అప్డేట్ చేసుకోవాలి అంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 5.56 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. అయితే వీరిలో గత పదేళ్లలో 1.49 కోట్ల మంది ఒక్కసారి కూడా తమ వివరాలను అప్డేట్ చేసుకోలేదు. వీరితో పాటు కొత్తగా ఆధార్ నమోదు, ఇతర మార్పులు చేర్పుల సేవలు అందజేసేందుకు ఈ ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది క్యాంపులను వినియోగించుకొని ఆధార్ సేవలు పొందేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు ఇందుకు ప్రచారం చేయించాలని ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa