శ్రీకాకుళం జిల్లా లావేటి మండలానికి చెందిన దంపతులు ఉపాధి కోసం విశాఖపట్నం వచ్చి ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద అమ్మాయి ఏడో తరగతి చదువుతోంది. 2020 అక్టోబరు 28న పాఠశాలకు వెళ్లింది. అక్కడ బాలికకు అధిక రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బాలిక ఆరు నెలల గర్భవతిగా డాక్టర్లు నిర్ధారించారు. బాలిక పెద్దమ్మ ఫిర్యాదు మేరకు మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక తండ్రే ఇందుకు కారణమని నేరం రుజువు కావడంతో తండ్రికి యావజ్జీవ కారాగార శిక్ష, ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనందిని సోమవారం తీర్పు చెప్పారు. బాధితురాలికి రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa