విశాఖలోని భీమునిపట్నం ప్రాంతం తుర్లవాడ కొండపై 120 ఎకరాలు కాజేసేందుకు ఏ-2 విజయసాయిరెడ్డి కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తుర్లవాడ ఆధ్యాత్మిక క్షేత్రం అని దీని జోలికి రావొద్దని అన్నారు. విజయసాయిరెడ్డి తన కూతురు విద్యాసంస్థల నిర్మాణం కోసం 120 ఎకరాలు కేటాయించాలని జగన్ రెడ్డిని కోరారని.. రూ.300 కోట్ల విలువైన భూమిని విజయసాయిరెడ్డికి బహుమతిగా ఇవ్వడానికి జగన్ రెడ్డి యత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తిని జగన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు దానం చేస్తున్నారని మండిపడ్డారు. కొండపై 120 అడుగుల నరసింహస్వామి విగ్రహం ప్రతిష్టించాలని స్థానికులు టీటీడీని కోరుతున్నారని మాజీ మంత్రి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa