ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ,,,,హుండీకి రూ.4.75 కోట్ల ఆదాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 05, 2023, 12:41 PM

తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తగ్గినట్టే తగ్గి.. మళ్లీ నేడు (మంగళవారం) పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. సోమవారం నాడు శ్రీవారిని 76,555 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారంతో పోల్చితే భక్తుల సంఖ్య తగ్గినా.. శ్రీవారి హుండీకి ఆదాయం మాత్రం తగ్గలేదు. హుండీ ఆదాయం రూ.4.75 కోట్ల వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 33,488 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.


కాగా, ఇటీవల టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమితైలన రామిరెడ్డి, అశ్వ‌ర్థ నాయ‌క్ సోమ‌వారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి సన్నిధిలో వీరితో జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం ప్రమాణ స్వీకారం చేయించారు. వీరికి స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం డిప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. మరోవైపు, మంగళవారం టీటీడీ పాలక మండలి సమావేశం జరుగుతోంది.


మరోవైపు, తిరుపతి నగరంలో జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమానికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని పాలకమండలి ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. అయితే, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ జరిగే సెప్టెంబరు 22న నిమజ్జనాలు జరగకుండా వినాయక నిమజ్జన కమిటీ ప్రతినిధులు, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. గరుడ సేవ జరిగే రోజునే వినాయక విగ్రహాల ఐదో రోజు నిమజ్జనం వస్తోంది. అయితే, ఆ రోజున పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం తిరుమలలో ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉన్నందున విగ్రహ నిమజ్జనాలు లేకుండా చర్యలు తీసుకోవాలని నిమజ్జన కమిటీ, అధికారులకు ఆయన సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa