ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోస్టులని భర్తీ చెయ్యాలని నిరుద్యోగులు నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 05, 2023, 02:01 PM

గ్రూపు-2 పోస్టులను భర్తీ చేయాలనే ప్రధాన డిమాండ్‌తో నిరుద్యోగ జేఏసీ మంగళవారం విశాఖలో ఆందోళనకు పిలుపునిచ్చింది. ఎంవీపీ కాలనీలోని ప్రధాన కూడలి నుంచి పోలీస్‌ స్టేషన్‌ జంక్షన్‌ వరకూ ర్యాలీ నిర్వహించి, అక్కడ రహదారిపై బైఠాయించి నిరసన తెలపనున్నట్టు జేఏసీ ప్రకటించింది. మంత్రి మండలి వెయ్యి గ్రూపు-2 పోస్టులు భర్తీకి ఆమోదం తెలిపితే, ఆర్థిక శాఖ 508 పోస్టులకు భర్తీకి మాత్రమే అనుమతి ఇవ్వడం దారుణమని, ఇది నిరుద్యోగులను మోసం చేయడమేనని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ సిద్ధిక్‌ పేర్కొన్నారు. అందుకే నిరుద్యోగులు ఈ నిరసనలో పాల్గొని ప్రభుత్వానికి తమ సత్తాను తెలియజేయాలన్నారు. ఈ నిరసనలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుతోపాటు పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొననున్నట్టు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa