టీడీపీ చేసిన పాపాల వల్లే ఇప్పుడు ఏపీలో భారీగా నకిలీ ఓటర్లు ఉన్నారని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. టీడీపీ చేసిన తప్పును వైయస్ఆర్ సీపీ మీద వేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ఎన్నికల ఓటర్ లిస్టులో డూప్లికేట్ ఓటర్లు ఇంకా ఉన్నారని తెలిపారు. ఒకే పేరు.. ఒకే ఐడీ.. ఒకే ఫొటోతో వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నాయి.. దీన్ని సరి చేయాలని ఎన్నికల అధికారిని కోరామని ఆయన పేర్కొన్నారు. ఏపీ ఓటర్ లిస్టులో అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ గగ్గోలు పెడుతోంది.. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం.. పార్టీ ఓటర్ల జాబితాలో అక్రమాలు పాల్పడుతోందని విమర్శలు చేస్తున్నారు.. బీజేపీ కూడా ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ పదవి పోయిన ఓ నేత వచ్చి మాట్లాడుతున్నారు అని పేర్నినాని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa