నంద్యాల జిల్లాలో ఎన్ఐఏ సోదాలు కలకలంరేపాయి. గురువారం ఉదయం ఆళ్లగడ్డలో అధికారులు సోదాలు నిర్వహించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన యూనస్ను మూడు నెలల కిందట నంద్యాలలో ఎన్ఐఏ అరెస్టు చేసింది. అతడి అత్తమ్మ గ్రామమైన ఆళ్లగడ్డలో ఇవాళ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎన్ఐఏ ఎస్పీ రాజీవ్ నేతృత్వంలో సిబ్బంది సోదాలు చేశారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో యూనిస్ బంధువుల ఇళ్లలో దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
యూనస్ పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కీలక నేత ఉన్నారు. అతడ్ని కర్ణాటకలో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ కుట్ర కేసులో యూనస్ నిందితుడిగా ఉన్నారు.. పీఎఫ్ఐలో ఆయుధ శిక్షకుడిగా వ్యవహరించిన యూనస్.. తెలుగు రాష్ట్రాల్లో పీఎఫ్ఐ సభ్యులకు ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు ఎన్ఐఏ గుర్తించింది.ఈ కేసులో ఇప్పటి వరకు చాలామందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.. అందరిపై ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. వారు ఇచ్చిన సమాచారంతో యూనస్ను కర్ణాటకలో అరెస్ట్ చేసింది.
యూనస్ గతంలో నంద్యాలలో తన సోదరుడికి చెందిన ఇన్వర్టర్ షాపులో పని చేశాడు. 2022లో ఎన్ఐఏ సోదాల సమయంలో బళ్లారికి పారిపోయాడు. అక్కడ బషీర్గా పేరు మార్చుకుని.. షేక్ ఇలియాస్ అనే మరో వ్యక్తితో కలిసి పీఎఫ్ఐ సభ్యులకు ఆయుధ శిక్షణ ఇచ్చాడు. అక్కడ ప్లంబర్ గా పని చేస్తూ ప్రత్యేక కోడ్ భాషలో ఉగ్రవాదులతో సంభాషణలు జరుపుతున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ వ్యాప్తంగా ఉన్న పీఎఫ్ఐ కార్యాలయాల్లో ఏక కాలంలో ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. యూపి, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పిఎఫ్ఐ కార్యకలాపాలపై సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి సోదాలతో కలకలంరేగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa